2025

సాచెట్ యాప్

జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) ప్రారంభించిన సాచెట్ మొబైల్ అప్లికేషన్, భారతదేశంలో విపత్తు సంసిద్ధతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల తన ‘మన్ కీ బాత్’ ప్రసంగంలో దీనిని ప్రస్తావించారు.

సాచెట్ యాప్ అంటే ఏమిటి?

  • వివిధ విపత్తుల గురించి రియల్-టైమ్ జియో-ట్యాగ్ చేయబడిన హెచ్చరికలను అందించడానికి సాచెట్ యాప్ రూపొందించబడింది.
  • ఇది కామన్ అలర్ట్ ప్రోటోకాల్ (CAP) పై పనిచేస్తుంది, వినియోగదారుల స్థానాల ఆధారంగా సకాలంలో నోటిఫికేషన్‌లను నిర్ధారిస్తుంది.
  • పౌరులు నిర్దిష్ట రాష్ట్రాలు లేదా జిల్లాలకు సంబంధించిన హెచ్చరికలకు సభ్యత్వాన్ని పొందవచ్చు, స్థానిక అవగాహనను పెంచుతుంది.
  • ఈ యాప్ వరదలు , తుఫానులు , కొండచరియలు విరిగిపడటం , సునామీలు, అడవి మంటలు మరియు మరిన్ని వంటి విపత్తులను కవర్ చేస్తుంది .

సాచెట్ యాప్ యొక్క లక్షణాలు

ఈ యాప్ భారత వాతావరణ శాఖ (IMD) నుండి రోజువారీ వాతావరణ నవీకరణలు మరియు సూచనలను అందిస్తుంది. వినియోగదారులు అధీకృత ప్రభుత్వ వనరుల నుండి కీలకమైన సమాచారాన్ని అందుకుంటారు. ఈ యాప్ విపత్తు నిర్వహణ కోసం చేయవలసినవి మరియు చేయకూడనివి మరియు హెల్ప్‌లైన్ నంబర్‌ల వంటి ముఖ్యమైన వనరులను కూడా కలిగి ఉంటుంది. ఒక ముఖ్యమైన లక్షణం దాని ఉపగ్రహ కనెక్టివిటీ, ఇది సాంప్రదాయ నెట్‌వర్క్‌లు విఫలమైనప్పుడు తీవ్రమైన అత్యవసర పరిస్థితులలో కమ్యూనికేషన్‌ను నిర్ధారిస్తుంది.

రాజస్థాన్‌లో 4500 ఏళ్ల నాటి నాగరికత.. మహాభారత ఆధారాలు గుర్తింపు!

రాజస్థాన్‌లోని డీగ్ జిల్లాలోని బహాజ్ గ్రామంలో 4,500 సంవత్సరాల నాటి నాగరికతకు సంబంధించిన ఆధారాలను భారత పురావస్తు సర్వే (ASI) కనుగొంది. 2024 జనవరి 10న ప్రారంభమైన ఈ తవ్వకంలో అనేక ముఖ్యమైన విషయాలు బయటపడ్డాయి. వాటిలో 23 మీటర్ల లోతైన పాలియో-ఛానల్ కూడా ఉంది. దీనిని పురావస్తు శాస్త్రవేత్తలు రుగ్వేదంలో ప్రస్తావించిన పౌరాణిక సరస్వతి నదికి అనుసంధానిస్తున్నారు.

ఈ పురాతన నదీ వ్యవస్థ బహుశా ప్రారంభ మానవ స్థావరాలకు మద్దతు ఇచ్చిందని, బహాజ్‌ను పెద్ద సరస్వతి బేసిన్ సంస్కృతికి అనుసంధానించిందని అంచనా వేస్తున్నారు. తవ్వకాలలో 800కి పైగా కళాఖండాలు బయటపడ్డాయి. వాటిలో కుండలు, బ్రాహ్మి లిపిలోని పురాతన ముద్రలు, రాగి నాణేలు, యజ్ఞ కుండ్, మౌర్యుల కాలం నాటి శిల్పాలు, శివుడు, పార్వతి విగ్రహాలు, ఎముకలతో చేసిన పనిముట్లు ఉన్నాయి. ఈ తవ్వకంలో హరప్పా అనంతర కాలం, మహాభారత కాలం, మౌర్యుల కాలం, కుషాణుల కాలం, గుప్తుల కాలం వంటి ఐదు వేర్వేరు కాలాలకు సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయి. ఇటీవలి పరిశోధనల ప్రకారం బ్రజ్ ప్రాంతం మతపరమైన, సాంస్కృతిక, చారిత్రక వారసత్వ కేంద్రంగా ఉంది.

బహాజ్ గ్రామంలో తవ్వకం దాదాపు 23 మీటర్ల లోతుకు చేరుకుంది, ఇది ఇప్పటివరకు రాజస్థాన్‌లో నిర్వహించిన లోతైన తవ్వకాలలో ఒకటి. ఈ తవ్వకంలో రుగ్వేద సరస్వతి నదికి అనుసంధానించబడిన ఒక పురాతన నదీ కాలువ లేదా పాలియో కాలువ బయటపడిందని ASI సైట్ హెడ్ పవన్ సరస్వత్ తెలిపారు. ఈ నీటి వ్యవస్థ సరస్వతి లోయను మధుర, బ్రజ్ ప్రాంతాలతో అనుసంధానించే ప్రారంభ మానవ స్థావరాలకు మద్దతు ఇచ్చి ఉండవచ్చని ఆయన అన్నారు. ASI బృందం ప్రకారం.. తవ్వకంలో మహాభారత కాలం నాటి కుండలు, హవన్ కుండ్‌లతో కూడిన పొరలు కూడా బయటపడ్డాయి. వీటిలో దీర్ఘచతురస్రాకార, వృత్తాకార చిత్రాలు, అగ్ని ఆచారాల అవశేషాలు ఉన్నాయి. ఈ కుండలు మహాభారత కాలం నాటి దుస్తులు, పాత్రల వర్ణనలతో సరిపోలుతున్నాయని అధికారులు తెలిపారు.

ఈ ప్రదేశంలో జరిపిన తవ్వకాల్లో మౌర్య మాతృదేవత తలగా భావించే 400 BC నాటి విగ్రహం లభించిందని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గుప్తుల నిర్మాణ శైలికి చెందిన మట్టి గోడలు, స్తంభాలు, లోహశాస్త్రానికి సంబంధించిన కొలిమిలు, ఇవి రాగి, ఇనుము ముడి పదార్థాల వాడకాన్ని సూచిస్తున్నాయి. సూదులు, దువ్వెనలు, అచ్చులు వంటి ఎముకలతో తయారు చేయబడిన ఉపకరణాలు భారతదేశంలో మొదటిసారిగా ఈ రూపంలో కనుగొనబడ్డాయి. త్రవ్వకాల్లో లభించిన ఇతర ఆధారాలలో శక్తి, భక్తి సంప్రదాయాలతో ముడిపడి ఉన్న శివ-పార్వతిల టెర్రకోట విగ్రహాలు ఉన్నాయి. ఆ కాలం నాటి వాణిజ్య, సౌందర్య సంప్రదాయాలను ప్రతిబింబించే శంఖం గాజులు, అర్ధ-విలువైన రాతి పూసలు. వేద, ఉత్తరవేద కాలాల మతపరమైన ఆచారాలను నిర్ధారించే 15 కి పైగా యజ్ఞ కుండ్లు బయటపడ్డాయి.

తవ్వకం సమయంలో ఒక మానవ అస్థిపంజరం కూడా బయటపడింది. దీనిని పరీక్ష కోసం ఇజ్రాయెల్‌కు పంపారు. ఈ తవ్వకం రాజస్థాన్ మాత్రమే కాకుండా మొత్తం ఉత్తర భారతదేశం, ప్రాచీన చరిత్రను అర్థం చేసుకోవడానికి కొత్త దిశను అందిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇప్పటికే ASI సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు ఒక నివేదికను సమర్పించింది. ఈ ప్రాంతాన్ని జాతీయ పురావస్తు రక్షిత ప్రాంతంగా ప్రకటించే అవకాశం ఉంది.

How to Use Multiple Accounts in Whatsapp: 

How to Use Multiple Accounts in Whatsapp: మీరు వాట్సాప్‌లో మల్టిపుల్ అకౌంట్స్ వినియోగించాలనుకుంటున్నారా? ఇందుకోసం క్లోన్ యాప్​లు లేదా ఫేక్ అకౌంట్స్​ వాడాల్సిన పని కూడా లేదు. ఒకే ఫోన్​లో ఒకే వాట్సాప్​​లో రెండు అకౌంట్స్​ నిర్వహించుకోవచ్చు. ఆండ్రాయిడ్ డివైజ్​లలో వాట్సాప్‌ మల్టిపుల్ అకౌంట్స్​ను వినియోగించుకునే వెసులుబాటు ఉంది. అంటే ఒకే ఆండ్రాయిడ్ డివైజ్​లో ఇప్పటికే ఉన్న వాట్సాప్​కు మరో అకౌంట్​ను యాడ్ చేసుకుని వినియోగించుకోవచ్చు. త్వరలో ఈ ఫీచర్​ ఐఫోన్ డివైజ్​లలోకి కూడా అందుబాటులోకి వస్తుంది. ఇకపోతే మీ వద్ద ఆండ్రాయిడ్ డివైజ్​లు ఉంటే ఈ ఫీచర్​ను ఎలా వినియోగించుకోవాలో తెలుసుకుందాం రండి.

మరొక వాట్సాప్​ అకౌంట్​లోకి లాగిన్ అవ్వడం ఎలా?:

  • ఇందుకోసం మొదట వాట్సాప్​ ఓపెన్ చేసి కుడి వైపున ఉన్న మూడు-చుక్కలతో ఉన్న నిలువు ఐకాన్​పై క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత ‘Settings’ ఆప్షన్​లోకి వెళ్లండి.
  • దాని లోపల పైభాగంలో మీ పేరు పక్కన ప్లస్ (+) గుర్తు కన్పిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు ‘Add Account’ అనే ఆప్షన్​ను కన్పిస్తుంది. దానిపై ట్యాప్ చేసిన తర్వాత ‘Agree and continue’ ఆప్షన్​ కన్పిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత మీరు మీ రెండవ వాట్సాప్​ అకౌంట్​ ఫోన్ నంబర్‌ను ఎంటర్​ చేయండి.
  • ఇలా చేసిన తర్వాత మీ స్క్రీన్‌పై వెరిఫికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు దానిలోని ‘Continue’ ఆప్షన్​పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు వాట్సాప్​ నుంచి వెరిఫికేషన్​ కాల్ వస్తుంది. వెరిఫికేషన్ కోసం మీరు ఇతర ఆప్షన్​లను కూడా ఉపయోగించవచ్చు. దాని కోసం మీరు ‘Verify another way’ ఎంపికను ఎంచుకోవాలి. తర్వాత ‘Missed Call’ కాకుండా మీకు ‘SMS’, ‘Voice Call’ స్వీకరించే ఆప్షన్​ లభిస్తుంది. మీరు ఈ మూడు ఎంపికలలో దేనినైనా ఎంచుకోవచ్చు.
  • ఆ తర్వాత మీరు మీ పేరు, ప్రొఫైల్ పిక్చర్ వంటి దశలను కంప్లీట్ చేసి మీ వాట్సాప్ అకౌంట్​ను సెటప్ చేసుకోండి. తర్వాత మీరు ‘Next’ ఎంపికపై క్లిక్ చేయండి.
  • అంతే ఇక మీరు మీ ఒకే డివైజ్​లో మరో వాట్సాప్​ అకౌంట్​ను వినియోగించుకోవచ్చు.
  • అయితే ప్రస్తుతానికి ఒక డివైజ్​లో గరిష్ఠంగా రెండు వరకు అకౌంట్స్​ను మాత్రమే వాట్సాప్​లో ఉపయోగించుకునే సదుపాయం ఉంది.

ఐఫోన్‌లోకి కూడా!: పైన పేర్కొన్న ఈ స్టెప్స్​ను ఫాలో అయిన తర్వాత ఎటువంటి క్లోన్ యాప్ లేకుండా ఒకే పరికరంలో ఒకటి కంటే ఎక్కువ వాట్సాప్ అకౌంట్​లను ఉపయోగించుకోవచ్చు. అయితే ఇప్పటివరకు ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ డివైజ్​లకు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు WabetaInfo తాజా నివేదిక ప్రకారం ఈ ఫీచర్ త్వరలో ఐఫోన్‌లోకి కూడా అందుబాటులోకి రానుంది.

 ఇకపై నేరుగా ఏటీఎం, యూపీఐ నుంచి పీఎఫ్ విత్​డ్రా

ఈపీఎఫ్​ఓ చందాదారులకు గుడ్ న్యూస్​. ఉద్యోగులు తమ ప్రావిడెంట్​ ఫండ్​ (పీఎఫ్​)ను త్వరలో నేరుగా ఏటీఎం, యూపీఐల ద్వారా విత్​డ్రా చేసుకునే అవకాశం రానుంది. అయితే ఇందుకోసం ఉద్యోగులు తమ బ్యాంక్ ఖాతాలను ఈపీఎఫ్​తో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది.

కార్మిక మంత్రిత్వశాఖ ఈ ప్రాజెక్ట్​పై పనిచేస్తోందని ఓ ఉన్నత స్థాయి అధికారి తెలిపారు. దీని ద్వారా ఇకపై ఉద్యోగుల పీఎఫ్​ ఖాతాలో కొంత భాగాన్ని స్తంభింపజేసి, మిగిలిన డబ్బును యూపీఐ, ఏటీఎం డెబిట్​ కార్డులు మొదలైన వివిధ పద్ధతులు ఉపయోగించి విత్​డ్రా చేసుకునేందుకు వీలు కల్పిస్తారని ఆయన అన్నారు. అయితే ఈ వ్యవస్థను అమలు చేయడంలో కొన్ని సవాళ్లు ఉన్నాయని, అందులో భాగంగా ప్రస్తుతం సాఫ్ట్​వేర్ సమస్యలను పరిష్కరిస్తున్నట్లు ​ఆయన చెప్పారు.

ప్రస్తుతం ఎంప్లాయీస్​ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్​ (ఈపీఎఫ్​ఓ) చందాదారులు తమ పీఎఫ్ డబ్బును విత్​డ్రా చేసుకోవాలంటే, ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. దీని వల్ల పీఎఫ్​ డబ్బులు పొందడానికి చాలా సమయం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

రూ.1లక్ష నుంచి రూ.5లక్షలకు పెంపు
ఆటో-సెటిల్​మెంట్ మోడ్ కింద, దరఖాస్తు ఫారమ్​ దాఖలు చేసిన 3 రోజుల్లో పీఎఫ్​ విత్​డ్రా క్లెయిమ్​ను ఎలక్ట్రానిక్​గా పరిష్కరిస్తారు. కనుక మాన్యువల్ పనులు చేయాల్సిన పని తప్పుతుంది.​ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ఆటో-సెటిల్​మెంట్ మోడ్​ పరిమితిని మంగళవారం రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచారు. దీని వల్ల ఈపీఎఫ్​ఓ చందదారులకు చాలా ప్రయోజనం చేకూరనుంది. ముఖ్యంగా విద్య, వివాహం, గృహ అవసరాలకు, అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కేవలం 3 రోజుల్లోగా తమ పీఎఫ్​ డబ్బులు పొందగలుగుతారు.

‘సార్క్’కు పోటీగా – దక్షిణాసియాలో పాక్, చైనా కొత్త కూటమి?

‘సార్క్'(SAARC)కు ప్రత్యామ్నాయంగా దక్షిణాసియాలో కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు కాబోతోందా? ఈ దిశగా పాకిస్థాన్, చైనా కసరత్తు చేస్తున్నాయా? అంటే ఔను అనే సమాధానమే వినిపిస్తోంది. ఈ మేరకు వివరాలతో పాకిస్థాన్‌కు చెందిన ఓ వార్తాపత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది. పాక్ దౌత్యవర్గాలే తమకు ఈ సమాచారాన్ని అందించాయని వెల్లడించింది. కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటుపై పాక్, చైనాలు ప్రస్తుతం అత్యున్నత స్థాయి చర్చలు జరుపుతున్నాయని ఆ వార్తా నివేదిక తెలిపింది. దక్షిణాసియా దేశాల ఐకమత్యాన్ని పెంపొందించేందుకు కొత్త ప్రాంతీయ కూటమి అవసరమనే బలమైన భావనతో పాక్, చైనాలు ఉన్నాయని పేర్కొంది. 1985 డిసెంబరు 8న ఏర్పాటైన సార్క్ కూటమిలో వ్యవస్థాపక దేశాలుగా భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవ్స్, నేపాల్, శ్రీలంక ఉన్నాయి. 2007లో ఇందులో అఫ్గానిస్థాన్​ చేరింది. సార్క్‌కు ప్రత్యామ్నాయంగా నిలిచేలా కొత్త ప్రాంతీయ కూటమికి రూపకల్పన చేయాలని చైనా, పాక్ భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవలే ఈ చర్చల్లో బంగ్లాదేశ్ కూడా భాగమైనట్లు తెలుస్తోంది.

సార్క్ దేశాలన్నింటికీ ఆహ్వానం
సార్క్‌లోని దేశాలన్నింటినీ నూతన కూటమిలోకి ఆహ్వానించాలని యోచిస్తున్నట్లు ఆ వార్తా కథనంలో ప్రస్తావించారు. శ్రీలంక, మాల్దీవ్స్, ఆఫ్ఘనిస్తాన్ ఈ కూటమిలో చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారత్‌కు కూడా ఆహ్వానం అందుతుందన్నారు. దక్షిణాసియా దేశాలు పరస్పర వాణిజ్యాన్ని మెరుగుపర్చుకోవడం, మౌలిక వసతులతో అనుసంధానాన్ని పెంచుకోవడం అనేది నూతన కూటమి లక్ష్యమని ఆ కథనంలో రాసుకొచ్చారు.

పదేళ్లుగా ‘సార్క్’ సైలెంట్- రంగంలోకి చైనా, పాక్
చివరిసారిగా 2014లో నేపాల్‌లోని కాఠ్మండులో సార్క్ సదస్సు జరిగింది. 2016లో పాక్‌లోని ఇస్లామాబాద్ వేదికగా సార్క్ సదస్సు జరగాల్సి ఉండగా, ఆ ఏడాది సెప్టెంబరు 18న భారత్‌లోని యురిలో ఉన్న ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రదాడి జరిగింది. దీంతో ఆ సదస్సుకు భారత్ గైర్హాజరైంది. బంగ్లాదేశ్, భూటాన్, అఫ్గానిస్థాన్ కూడా సదస్సుకు రాలేమని చెప్పాయి. దీంతో సదస్సును వాయిదా వేస్తున్నట్లు పాక్ ప్రకటించింది. మళ్లీ ఇప్పటి వరకు సార్క్ సదస్సు జరగలేదు. అందుకే సార్క్‌కు ప్రత్యామ్నాయ కూటమిని తెచ్చేందుకు పాక్, చైనా కసరత్తు చేస్తున్నాయని కథనంలో వివరించారు.

నూతన ప్రాంతీయ కూటమి ప్రతిపాదనే రాలేదు!
‘దక్షిణాసియా దేశాలతో నూతన ప్రాంతీయ కూటమి ఏర్పాటు కాబోతోందనే ప్రచారం అవాస్తవం. ఇటీవలే జరిగిన చైనా, పాక్, బంగ్లాదేశ్ త్రైపాక్షిక సమావేశానికి రాజకీయాలతో సంబంధం లేదు. ఆ సమావేశంలో నూతన కూటమి ప్రతిపాదనేదీ రాలేదు’ అని బంగ్లాదేశ్ విదేశాంగ వ్యవహారాల సలహాదారుడు ఎం.తౌహీద్ హుస్సేన్ స్పష్టం చేశారు.

ఒకే వాట్సాప్​లో రెండు అకౌంట్స్​

How to Use Multiple Accounts in Whatsapp: మీరు వాట్సాప్‌లో మల్టిపుల్ అకౌంట్స్ వినియోగించాలనుకుంటున్నారా? ఇందుకోసం క్లోన్ యాప్​లు లేదా ఫేక్ అకౌంట్స్​ వాడాల్సిన పని కూడా లేదు. ఒకే ఫోన్​లో ఒకే వాట్సాప్​​లో రెండు అకౌంట్స్​ నిర్వహించుకోవచ్చు. ఆండ్రాయిడ్ డివైజ్​లలో వాట్సాప్‌ మల్టిపుల్ అకౌంట్స్​ను వినియోగించుకునే వెసులుబాటు ఉంది. అంటే ఒకే ఆండ్రాయిడ్ డివైజ్​లో ఇప్పటికే ఉన్న వాట్సాప్​కు మరో అకౌంట్​ను యాడ్ చేసుకుని వినియోగించుకోవచ్చు. త్వరలో ఈ ఫీచర్​ ఐఫోన్ డివైజ్​లలోకి కూడా అందుబాటులోకి వస్తుంది. ఇకపోతే మీ వద్ద ఆండ్రాయిడ్ డివైజ్​లు ఉంటే ఈ ఫీచర్​ను ఎలా వినియోగించుకోవాలో తెలుసుకుందాం రండి.

మరొక వాట్సాప్​ అకౌంట్​లోకి లాగిన్ అవ్వడం ఎలా?:

  • ఇందుకోసం మొదట వాట్సాప్​ ఓపెన్ చేసి కుడి వైపున ఉన్న మూడు-చుక్కలతో ఉన్న నిలువు ఐకాన్​పై క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత ‘Settings’ ఆప్షన్​లోకి వెళ్లండి.
  • దాని లోపల పైభాగంలో మీ పేరు పక్కన ప్లస్ (+) గుర్తు కన్పిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు ‘Add Account’ అనే ఆప్షన్​ను కన్పిస్తుంది. దానిపై ట్యాప్ చేసిన తర్వాత ‘Agree and continue’ ఆప్షన్​ కన్పిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత మీరు మీ రెండవ వాట్సాప్​ అకౌంట్​ ఫోన్ నంబర్‌ను ఎంటర్​ చేయండి.
  • ఇలా చేసిన తర్వాత మీ స్క్రీన్‌పై వెరిఫికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు దానిలోని ‘Continue’ ఆప్షన్​పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు వాట్సాప్​ నుంచి వెరిఫికేషన్​ కాల్ వస్తుంది. వెరిఫికేషన్ కోసం మీరు ఇతర ఆప్షన్​లను కూడా ఉపయోగించవచ్చు. దాని కోసం మీరు ‘Verify another way’ ఎంపికను ఎంచుకోవాలి. తర్వాత ‘Missed Call’ కాకుండా మీకు ‘SMS’, ‘Voice Call’ స్వీకరించే ఆప్షన్​ లభిస్తుంది. మీరు ఈ మూడు ఎంపికలలో దేనినైనా ఎంచుకోవచ్చు.
  • ఆ తర్వాత మీరు మీ పేరు, ప్రొఫైల్ పిక్చర్ వంటి దశలను కంప్లీట్ చేసి మీ వాట్సాప్ అకౌంట్​ను సెటప్ చేసుకోండి. తర్వాత మీరు ‘Next’ ఎంపికపై క్లిక్ చేయండి.
  • అంతే ఇక మీరు మీ ఒకే డివైజ్​లో మరో వాట్సాప్​ అకౌంట్​ను వినియోగించుకోవచ్చు.
  • అయితే ప్రస్తుతానికి ఒక డివైజ్​లో గరిష్ఠంగా రెండు వరకు అకౌంట్స్​ను మాత్రమే వాట్సాప్​లో ఉపయోగించుకునే సదుపాయం ఉంది.

ఐఫోన్‌లోకి కూడా!: పైన పేర్కొన్న ఈ స్టెప్స్​ను ఫాలో అయిన తర్వాత ఎటువంటి క్లోన్ యాప్ లేకుండా ఒకే పరికరంలో ఒకటి కంటే ఎక్కువ వాట్సాప్ అకౌంట్​లను ఉపయోగించుకోవచ్చు. అయితే ఇప్పటివరకు ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ డివైజ్​లకు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు WabetaInfo తాజా నివేదిక ప్రకారం ఈ ఫీచర్ త్వరలో ఐఫోన్‌లోకి కూడా అందుబాటులోకి రానుంది.

ఇఫ్కో మొట్టమొదటి విదేశీ నానో ఎరువుల కర్మాగారం

భారతదేశ వ్యవసాయ ఆవిష్కరణల పాదముద్రను ప్రపంచవ్యాప్తంగా విస్తరించే దిశగా ఒక ప్రధాన అడుగులో, ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ (IFFCO) బ్రెజిల్‌లో తన మొట్టమొదటి విదేశీ నానో ఎరువుల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తోంది. బ్రెజిలియన్ కంపెనీ నానోఫెర్ట్‌తో భాగస్వామ్యంతో ఈ వ్యూహాత్మక చర్య, స్థిరమైన మరియు సమర్థవంతమైన పంట పోషక పరిష్కారాల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను ఉపయోగించుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. వార్షికంగా 4.5 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్, దక్షిణ అమెరికాలో విస్తృతంగా సాగు చేయబడే మొక్కజొన్న, సోయాబీన్ మరియు చెరకు వంటి పంటలకు ఉపయోగపడుతుంది

ముఖ్యాంశాలు

  • బ్రెజిల్‌లో IFFCO ద్వారా స్థాపించబడిన మొట్టమొదటి అంతర్జాతీయ నానో ఎరువుల కర్మాగారం.
  • ఇఫ్కో నానోవెన్షన్స్ (భారతదేశం) మరియు నానోఫెర్ట్ (బ్రెజిల్) మధ్య జాయింట్ వెంచర్ (7:3 నిష్పత్తి).
  • వార్షిక సామర్థ్యం : 4.5 మిలియన్ లీటర్ల నానో ఎరువులు.
  • స్థానం: కురిటిబా, పరానా ప్రావిన్స్, బ్రెజిల్.
  • ట్రయల్ ప్రొడక్షన్: 2025 చివరి నాటికి ప్రారంభమవుతుందని అంచనా.
  • దిగుబడిని పెంచడానికి మరియు ఎరువుల వాడకాన్ని తగ్గించడానికి నానో ఎరువులు.

నేపథ్యం మరియు సందర్భం

  • IFFCO 2021లో భారతదేశంలో నానో యూరియాను ప్రారంభించింది.
  • 40+ దేశాలకు 0.5 మిలియన్ బాటిళ్లు ఎగుమతి చేయబడ్డాయి.
  • నానో యూరియా మరియు నానో DAP (డై-అమ్మోనియం ఫాస్ఫేట్) అనేవి సాంప్రదాయ ఎరువులకు ఖర్చుతో కూడుకున్నవి మరియు సమర్థవంతమైన ప్రత్యామ్నాయాలు.
  • నానో యూరియా : 500ml బాటిల్‌కు ₹240.
  • నానో DAP: 500ml బాటిల్‌కు ₹600.
  • నానో ఎరువులు ఈ క్రింది వాటికి ఒక మార్గంగా పరిశోధించబడి ప్రోత్సహించబడుతున్నాయి:
  • రసాయన ఎరువుల వల్ల పర్యావరణ నష్టాన్ని తగ్గించండి.
  • మొక్కలు పోషకాలను గ్రహించడాన్ని మెరుగుపరచండి.
  • నేల ఆరోగ్యం మరియు పంట ఉత్పాదకతను పెంచండి.

బ్రెజిల్‌కు ప్రాముఖ్యత

  • బ్రెజిల్ ప్రపంచ వ్యవసాయ శక్తి కేంద్రం.

క్షేత్ర పరీక్షలు చూపించాయి,

  • మొక్కజొన్న మరియు సోయాబీన్ పంటలలో 10% దిగుబడి పెరుగుదల.
  • చెరకు ఉత్పాదకతలో 7% పెరుగుదల.
  • సాంప్రదాయ యూరియా మరియు DAP వాడకంలో 20%+ తగ్గింపు.

వ్యూహాత్మక ప్రాముఖ్యత

  • ఎగుమతి ఖర్చులను తగ్గించి స్థానిక లభ్యతను పెంచుతుంది.
  • ఇండో-బ్రెజిల్ వ్యవసాయ-సాంకేతిక సహకారాన్ని బలోపేతం చేస్తుంది.
  • స్థిరమైన వ్యవసాయ ఇన్‌పుట్‌లలో భారతదేశం యొక్క ప్రపంచ నాయకత్వాన్ని విస్తరిస్తుంది.

భవిష్యత్తు ప్రణాళికలు

  • నానో జింక్ మరియు కాపర్ లిక్విడ్ వేరియంట్లను ప్రవేశపెట్టనున్న ఇఫ్కో.
  • నానో-ఎరువుల పరిశోధన మరియు అభివృద్ధి (R&D) మరియు ఉత్పత్తిలో ఇప్పటికే ₹4,200 కోట్ల పెట్టుబడి పెట్టబడింది.
  • దేశీయంగా దత్తత నెమ్మదిగా ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఎక్కువగానే ఉంది.

భారతదేశంలో మొట్టమొదటి సీతాకోకచిలుక అభయారణ్యం

జీవవైవిధ్య పరిరక్షణలో గణనీయమైన ముందడుగులో, కేరళ భారతదేశంలో మొట్టమొదటి సీతాకోకచిలుక అభయారణ్యానికి నిలయంగా మారింది. కన్నూర్ జిల్లాలోని అరలం వన్యప్రాణుల అభయారణ్యం అధికారికంగా అరలం సీతాకోకచిలుక అభయారణ్యంగా పేరు మార్చబడింది, ఇది దేశంలోనే మొట్టమొదటి చర్యగా గుర్తించబడింది. పచ్చని పశ్చిమ కనుమలలో 55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ అభయారణ్యం ఇప్పుడు 266 కి పైగా సీతాకోకచిలుక జాతులకు అంకితమైన ఆశ్రయంగా పనిచేస్తుంది, వీటిలో అనేక అరుదైన మరియు అంతరించిపోతున్నవి ఉన్నాయి.

వార్తల్లో ఎందుకు?

25 సంవత్సరాల పరిరక్షణ ప్రయత్నాలు, సర్వేలు మరియు పరిశోధకులు, అటవీ అధికారులు మరియు పర్యావరణ సమూహాల వాదనల తరువాత, జూన్ 18, 2025న, కేరళ రాష్ట్ర వన్యప్రాణి బోర్డు అరళం వన్యప్రాణుల అభయారణ్యం పేరును భారతదేశంలోని మొట్టమొదటి సీతాకోకచిలుక అభయారణ్యంగా ప్రకటించింది.

ముఖ్య లక్ష్యాలు & లక్ష్యం

  • సీతాకోకచిలుకలకు రక్షిత ఆవాసాలను అందించడం మరియు వాటి వలస కారిడార్లను రక్షించడం.
  • సీతాకోకచిలుకల సంరక్షణ గురించి అవగాహన పెంచడానికి.
  • స్థానిక సమాజాలు మరియు శాస్త్రవేత్తలకు ప్రయోజనం చేకూర్చేలా పర్యావరణ పర్యాటకం మరియు పరిశోధనలను ప్రోత్సహించడం.

అభయారణ్యం యొక్క ముఖ్యాంశాలు

  • స్థానం: కన్నూర్ జిల్లా, కేరళ, పశ్చిమ కనుమల లోపల.
  • విస్తీర్ణం: 55 చదరపు కిలోమీటర్లు.
  • నివాస రకం: ఉష్ణమండల మరియు పాక్షిక సతత హరిత అడవులు.
  • సీతాకోకచిలుక జాతుల సంఖ్య: 266+, కేరళ సీతాకోకచిలుక వైవిధ్యంలో 80% కంటే ఎక్కువ.
  • అరుదైన దృశ్యాలు : సాధారణ ఆల్బాట్రాస్, డానైన్ జాతులు మరియు అనేక స్థానిక సీతాకోకచిలుకలు.
  • సీజనల్ వలస: డిసెంబర్ మరియు ఫిబ్రవరి మధ్య సీతాకోకచిలుకల వలస గరిష్టంగా ఉంటుంది.
  • 1984 లో స్థాపించబడిన అరళం చాలా కాలంగా పరిశోధకులను మరియు వన్యప్రాణుల ఔత్సాహికులను ఆకర్షించింది.

పరిరక్షణ ప్రాముఖ్యత

  • అంతరించిపోతున్న మరియు స్థానిక సీతాకోకచిలుక జాతులకు రక్షణ కల్పిస్తుంది.
  • శాస్త్రీయ ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది – కొత్త జాతులు ఇప్పటికీ గుర్తించబడుతున్నాయి.
  • సీతాకోకచిలుకలు ముఖ్యమైన పరాగ సంపర్కాలు కాబట్టి, పర్యావరణ సమతుల్యతను నిర్ధారిస్తుంది.
  • దాని కొత్త అధికారిక హోదాతో నిధుల అవకాశాలు మరియు పరిరక్షణ విధానాలను బలోపేతం చేస్తుంది.

జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) ప్రారంభించిన సాచెట్ మొబైల్ అప్లికేషన్, భారతదేశంలో విపత్తు సంసిద్ధతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది.

సాచెట్ యాప్ అంటే ఏమిటి?

  • వివిధ విపత్తుల గురించి రియల్-టైమ్ జియో-ట్యాగ్ చేయబడిన హెచ్చరికలను అందించడానికి సాచెట్ యాప్ రూపొందించబడింది.
  • ఇది కామన్ అలర్ట్ ప్రోటోకాల్ (CAP) పై పనిచేస్తుంది, వినియోగదారుల స్థానాల ఆధారంగా సకాలంలో నోటిఫికేషన్‌లను నిర్ధారిస్తుంది.
  • పౌరులు నిర్దిష్ట రాష్ట్రాలు లేదా జిల్లాలకు సంబంధించిన హెచ్చరికలకు సభ్యత్వాన్ని పొందవచ్చు, స్థానిక అవగాహనను పెంచుతుంది.
  • ఈ యాప్ వరదలు , తుఫానులు , కొండచరియలు విరిగిపడటం , సునామీలు, అడవి మంటలు మరియు మరిన్ని వంటి విపత్తులను కవర్ చేస్తుంది .

సాచెట్ యాప్ యొక్క లక్షణాలు

ఈ యాప్ భారత వాతావరణ శాఖ (IMD) నుండి రోజువారీ వాతావరణ నవీకరణలు మరియు సూచనలను అందిస్తుంది. వినియోగదారులు అధీకృత ప్రభుత్వ వనరుల నుండి కీలకమైన సమాచారాన్ని అందుకుంటారు. ఈ యాప్ విపత్తు నిర్వహణ కోసం చేయవలసినవి మరియు చేయకూడనివి మరియు హెల్ప్‌లైన్ నంబర్‌ల వంటి ముఖ్యమైన వనరులను కూడా కలిగి ఉంటుంది. ఒక ముఖ్యమైన లక్షణం దాని ఉపగ్రహ కనెక్టివిటీ, ఇది సాంప్రదాయ నెట్‌వర్క్‌లు విఫలమైనప్పుడు తీవ్రమైన అత్యవసర పరిస్థితులలో కమ్యూనికేషన్‌ను నిర్ధారిస్తుంది.

జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) ప్రారంభించిన సాచెట్ మొబైల్ అప్లికేషన్, భారతదేశంలో విపత్తు సంసిద్ధతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల తన ‘మన్ కీ బాత్’ ప్రసంగంలో దీనిని ప్రస్తావించారు.

సాచెట్ యాప్ అంటే ఏమిటి?

  • వివిధ విపత్తుల గురించి రియల్-టైమ్ జియో-ట్యాగ్ చేయబడిన హెచ్చరికలను అందించడానికి సాచెట్ యాప్ రూపొందించబడింది.
  • ఇది కామన్ అలర్ట్ ప్రోటోకాల్ (CAP) పై పనిచేస్తుంది, వినియోగదారుల స్థానాల ఆధారంగా సకాలంలో నోటిఫికేషన్‌లను నిర్ధారిస్తుంది.
  • పౌరులు నిర్దిష్ట రాష్ట్రాలు లేదా జిల్లాలకు సంబంధించిన హెచ్చరికలకు సభ్యత్వాన్ని పొందవచ్చు, స్థానిక అవగాహనను పెంచుతుంది.
  • ఈ యాప్ వరదలు , తుఫానులు , కొండచరియలు విరిగిపడటం , సునామీలు, అడవి మంటలు మరియు మరిన్ని వంటి విపత్తులను కవర్ చేస్తుంది .

సాచెట్ యాప్ యొక్క లక్షణాలు

ఈ యాప్ భారత వాతావరణ శాఖ (IMD) నుండి రోజువారీ వాతావరణ నవీకరణలు మరియు సూచనలను అందిస్తుంది. వినియోగదారులు అధీకృత ప్రభుత్వ వనరుల నుండి కీలకమైన సమాచారాన్ని అందుకుంటారు. ఈ యాప్ విపత్తు నిర్వహణ కోసం చేయవలసినవి మరియు చేయకూడనివి మరియు హెల్ప్‌లైన్ నంబర్‌ల వంటి ముఖ్యమైన వనరులను కూడా కలిగి ఉంటుంది. ఒక ముఖ్యమైన లక్షణం దాని ఉపగ్రహ కనెక్టివిటీ, ఇది సాంప్రదాయ నెట్‌వర్క్‌లు విఫలమైనప్పుడు తీవ్రమైన అత్యవసర పరిస్థితులలో కమ్యూనికేషన్‌ను నిర్ధారిస్తుంది.