July 2025

సాచెట్ యాప్

జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) ప్రారంభించిన సాచెట్ మొబైల్ అప్లికేషన్, భారతదేశంలో విపత్తు సంసిద్ధతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల తన ‘మన్ కీ బాత్’ ప్రసంగంలో దీనిని ప్రస్తావించారు.

సాచెట్ యాప్ అంటే ఏమిటి?

  • వివిధ విపత్తుల గురించి రియల్-టైమ్ జియో-ట్యాగ్ చేయబడిన హెచ్చరికలను అందించడానికి సాచెట్ యాప్ రూపొందించబడింది.
  • ఇది కామన్ అలర్ట్ ప్రోటోకాల్ (CAP) పై పనిచేస్తుంది, వినియోగదారుల స్థానాల ఆధారంగా సకాలంలో నోటిఫికేషన్‌లను నిర్ధారిస్తుంది.
  • పౌరులు నిర్దిష్ట రాష్ట్రాలు లేదా జిల్లాలకు సంబంధించిన హెచ్చరికలకు సభ్యత్వాన్ని పొందవచ్చు, స్థానిక అవగాహనను పెంచుతుంది.
  • ఈ యాప్ వరదలు , తుఫానులు , కొండచరియలు విరిగిపడటం , సునామీలు, అడవి మంటలు మరియు మరిన్ని వంటి విపత్తులను కవర్ చేస్తుంది .

సాచెట్ యాప్ యొక్క లక్షణాలు

ఈ యాప్ భారత వాతావరణ శాఖ (IMD) నుండి రోజువారీ వాతావరణ నవీకరణలు మరియు సూచనలను అందిస్తుంది. వినియోగదారులు అధీకృత ప్రభుత్వ వనరుల నుండి కీలకమైన సమాచారాన్ని అందుకుంటారు. ఈ యాప్ విపత్తు నిర్వహణ కోసం చేయవలసినవి మరియు చేయకూడనివి మరియు హెల్ప్‌లైన్ నంబర్‌ల వంటి ముఖ్యమైన వనరులను కూడా కలిగి ఉంటుంది. ఒక ముఖ్యమైన లక్షణం దాని ఉపగ్రహ కనెక్టివిటీ, ఇది సాంప్రదాయ నెట్‌వర్క్‌లు విఫలమైనప్పుడు తీవ్రమైన అత్యవసర పరిస్థితులలో కమ్యూనికేషన్‌ను నిర్ధారిస్తుంది.

రాజస్థాన్‌లో 4500 ఏళ్ల నాటి నాగరికత.. మహాభారత ఆధారాలు గుర్తింపు!

రాజస్థాన్‌లోని డీగ్ జిల్లాలోని బహాజ్ గ్రామంలో 4,500 సంవత్సరాల నాటి నాగరికతకు సంబంధించిన ఆధారాలను భారత పురావస్తు సర్వే (ASI) కనుగొంది. 2024 జనవరి 10న ప్రారంభమైన ఈ తవ్వకంలో అనేక ముఖ్యమైన విషయాలు బయటపడ్డాయి. వాటిలో 23 మీటర్ల లోతైన పాలియో-ఛానల్ కూడా ఉంది. దీనిని పురావస్తు శాస్త్రవేత్తలు రుగ్వేదంలో ప్రస్తావించిన పౌరాణిక సరస్వతి నదికి అనుసంధానిస్తున్నారు.

ఈ పురాతన నదీ వ్యవస్థ బహుశా ప్రారంభ మానవ స్థావరాలకు మద్దతు ఇచ్చిందని, బహాజ్‌ను పెద్ద సరస్వతి బేసిన్ సంస్కృతికి అనుసంధానించిందని అంచనా వేస్తున్నారు. తవ్వకాలలో 800కి పైగా కళాఖండాలు బయటపడ్డాయి. వాటిలో కుండలు, బ్రాహ్మి లిపిలోని పురాతన ముద్రలు, రాగి నాణేలు, యజ్ఞ కుండ్, మౌర్యుల కాలం నాటి శిల్పాలు, శివుడు, పార్వతి విగ్రహాలు, ఎముకలతో చేసిన పనిముట్లు ఉన్నాయి. ఈ తవ్వకంలో హరప్పా అనంతర కాలం, మహాభారత కాలం, మౌర్యుల కాలం, కుషాణుల కాలం, గుప్తుల కాలం వంటి ఐదు వేర్వేరు కాలాలకు సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయి. ఇటీవలి పరిశోధనల ప్రకారం బ్రజ్ ప్రాంతం మతపరమైన, సాంస్కృతిక, చారిత్రక వారసత్వ కేంద్రంగా ఉంది.

బహాజ్ గ్రామంలో తవ్వకం దాదాపు 23 మీటర్ల లోతుకు చేరుకుంది, ఇది ఇప్పటివరకు రాజస్థాన్‌లో నిర్వహించిన లోతైన తవ్వకాలలో ఒకటి. ఈ తవ్వకంలో రుగ్వేద సరస్వతి నదికి అనుసంధానించబడిన ఒక పురాతన నదీ కాలువ లేదా పాలియో కాలువ బయటపడిందని ASI సైట్ హెడ్ పవన్ సరస్వత్ తెలిపారు. ఈ నీటి వ్యవస్థ సరస్వతి లోయను మధుర, బ్రజ్ ప్రాంతాలతో అనుసంధానించే ప్రారంభ మానవ స్థావరాలకు మద్దతు ఇచ్చి ఉండవచ్చని ఆయన అన్నారు. ASI బృందం ప్రకారం.. తవ్వకంలో మహాభారత కాలం నాటి కుండలు, హవన్ కుండ్‌లతో కూడిన పొరలు కూడా బయటపడ్డాయి. వీటిలో దీర్ఘచతురస్రాకార, వృత్తాకార చిత్రాలు, అగ్ని ఆచారాల అవశేషాలు ఉన్నాయి. ఈ కుండలు మహాభారత కాలం నాటి దుస్తులు, పాత్రల వర్ణనలతో సరిపోలుతున్నాయని అధికారులు తెలిపారు.

ఈ ప్రదేశంలో జరిపిన తవ్వకాల్లో మౌర్య మాతృదేవత తలగా భావించే 400 BC నాటి విగ్రహం లభించిందని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గుప్తుల నిర్మాణ శైలికి చెందిన మట్టి గోడలు, స్తంభాలు, లోహశాస్త్రానికి సంబంధించిన కొలిమిలు, ఇవి రాగి, ఇనుము ముడి పదార్థాల వాడకాన్ని సూచిస్తున్నాయి. సూదులు, దువ్వెనలు, అచ్చులు వంటి ఎముకలతో తయారు చేయబడిన ఉపకరణాలు భారతదేశంలో మొదటిసారిగా ఈ రూపంలో కనుగొనబడ్డాయి. త్రవ్వకాల్లో లభించిన ఇతర ఆధారాలలో శక్తి, భక్తి సంప్రదాయాలతో ముడిపడి ఉన్న శివ-పార్వతిల టెర్రకోట విగ్రహాలు ఉన్నాయి. ఆ కాలం నాటి వాణిజ్య, సౌందర్య సంప్రదాయాలను ప్రతిబింబించే శంఖం గాజులు, అర్ధ-విలువైన రాతి పూసలు. వేద, ఉత్తరవేద కాలాల మతపరమైన ఆచారాలను నిర్ధారించే 15 కి పైగా యజ్ఞ కుండ్లు బయటపడ్డాయి.

తవ్వకం సమయంలో ఒక మానవ అస్థిపంజరం కూడా బయటపడింది. దీనిని పరీక్ష కోసం ఇజ్రాయెల్‌కు పంపారు. ఈ తవ్వకం రాజస్థాన్ మాత్రమే కాకుండా మొత్తం ఉత్తర భారతదేశం, ప్రాచీన చరిత్రను అర్థం చేసుకోవడానికి కొత్త దిశను అందిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇప్పటికే ASI సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు ఒక నివేదికను సమర్పించింది. ఈ ప్రాంతాన్ని జాతీయ పురావస్తు రక్షిత ప్రాంతంగా ప్రకటించే అవకాశం ఉంది.

How to Use Multiple Accounts in Whatsapp: 

How to Use Multiple Accounts in Whatsapp: మీరు వాట్సాప్‌లో మల్టిపుల్ అకౌంట్స్ వినియోగించాలనుకుంటున్నారా? ఇందుకోసం క్లోన్ యాప్​లు లేదా ఫేక్ అకౌంట్స్​ వాడాల్సిన పని కూడా లేదు. ఒకే ఫోన్​లో ఒకే వాట్సాప్​​లో రెండు అకౌంట్స్​ నిర్వహించుకోవచ్చు. ఆండ్రాయిడ్ డివైజ్​లలో వాట్సాప్‌ మల్టిపుల్ అకౌంట్స్​ను వినియోగించుకునే వెసులుబాటు ఉంది. అంటే ఒకే ఆండ్రాయిడ్ డివైజ్​లో ఇప్పటికే ఉన్న వాట్సాప్​కు మరో అకౌంట్​ను యాడ్ చేసుకుని వినియోగించుకోవచ్చు. త్వరలో ఈ ఫీచర్​ ఐఫోన్ డివైజ్​లలోకి కూడా అందుబాటులోకి వస్తుంది. ఇకపోతే మీ వద్ద ఆండ్రాయిడ్ డివైజ్​లు ఉంటే ఈ ఫీచర్​ను ఎలా వినియోగించుకోవాలో తెలుసుకుందాం రండి.

మరొక వాట్సాప్​ అకౌంట్​లోకి లాగిన్ అవ్వడం ఎలా?:

  • ఇందుకోసం మొదట వాట్సాప్​ ఓపెన్ చేసి కుడి వైపున ఉన్న మూడు-చుక్కలతో ఉన్న నిలువు ఐకాన్​పై క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత ‘Settings’ ఆప్షన్​లోకి వెళ్లండి.
  • దాని లోపల పైభాగంలో మీ పేరు పక్కన ప్లస్ (+) గుర్తు కన్పిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు ‘Add Account’ అనే ఆప్షన్​ను కన్పిస్తుంది. దానిపై ట్యాప్ చేసిన తర్వాత ‘Agree and continue’ ఆప్షన్​ కన్పిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత మీరు మీ రెండవ వాట్సాప్​ అకౌంట్​ ఫోన్ నంబర్‌ను ఎంటర్​ చేయండి.
  • ఇలా చేసిన తర్వాత మీ స్క్రీన్‌పై వెరిఫికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు దానిలోని ‘Continue’ ఆప్షన్​పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు వాట్సాప్​ నుంచి వెరిఫికేషన్​ కాల్ వస్తుంది. వెరిఫికేషన్ కోసం మీరు ఇతర ఆప్షన్​లను కూడా ఉపయోగించవచ్చు. దాని కోసం మీరు ‘Verify another way’ ఎంపికను ఎంచుకోవాలి. తర్వాత ‘Missed Call’ కాకుండా మీకు ‘SMS’, ‘Voice Call’ స్వీకరించే ఆప్షన్​ లభిస్తుంది. మీరు ఈ మూడు ఎంపికలలో దేనినైనా ఎంచుకోవచ్చు.
  • ఆ తర్వాత మీరు మీ పేరు, ప్రొఫైల్ పిక్చర్ వంటి దశలను కంప్లీట్ చేసి మీ వాట్సాప్ అకౌంట్​ను సెటప్ చేసుకోండి. తర్వాత మీరు ‘Next’ ఎంపికపై క్లిక్ చేయండి.
  • అంతే ఇక మీరు మీ ఒకే డివైజ్​లో మరో వాట్సాప్​ అకౌంట్​ను వినియోగించుకోవచ్చు.
  • అయితే ప్రస్తుతానికి ఒక డివైజ్​లో గరిష్ఠంగా రెండు వరకు అకౌంట్స్​ను మాత్రమే వాట్సాప్​లో ఉపయోగించుకునే సదుపాయం ఉంది.

ఐఫోన్‌లోకి కూడా!: పైన పేర్కొన్న ఈ స్టెప్స్​ను ఫాలో అయిన తర్వాత ఎటువంటి క్లోన్ యాప్ లేకుండా ఒకే పరికరంలో ఒకటి కంటే ఎక్కువ వాట్సాప్ అకౌంట్​లను ఉపయోగించుకోవచ్చు. అయితే ఇప్పటివరకు ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ డివైజ్​లకు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు WabetaInfo తాజా నివేదిక ప్రకారం ఈ ఫీచర్ త్వరలో ఐఫోన్‌లోకి కూడా అందుబాటులోకి రానుంది.

 ఇకపై నేరుగా ఏటీఎం, యూపీఐ నుంచి పీఎఫ్ విత్​డ్రా

ఈపీఎఫ్​ఓ చందాదారులకు గుడ్ న్యూస్​. ఉద్యోగులు తమ ప్రావిడెంట్​ ఫండ్​ (పీఎఫ్​)ను త్వరలో నేరుగా ఏటీఎం, యూపీఐల ద్వారా విత్​డ్రా చేసుకునే అవకాశం రానుంది. అయితే ఇందుకోసం ఉద్యోగులు తమ బ్యాంక్ ఖాతాలను ఈపీఎఫ్​తో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది.

కార్మిక మంత్రిత్వశాఖ ఈ ప్రాజెక్ట్​పై పనిచేస్తోందని ఓ ఉన్నత స్థాయి అధికారి తెలిపారు. దీని ద్వారా ఇకపై ఉద్యోగుల పీఎఫ్​ ఖాతాలో కొంత భాగాన్ని స్తంభింపజేసి, మిగిలిన డబ్బును యూపీఐ, ఏటీఎం డెబిట్​ కార్డులు మొదలైన వివిధ పద్ధతులు ఉపయోగించి విత్​డ్రా చేసుకునేందుకు వీలు కల్పిస్తారని ఆయన అన్నారు. అయితే ఈ వ్యవస్థను అమలు చేయడంలో కొన్ని సవాళ్లు ఉన్నాయని, అందులో భాగంగా ప్రస్తుతం సాఫ్ట్​వేర్ సమస్యలను పరిష్కరిస్తున్నట్లు ​ఆయన చెప్పారు.

ప్రస్తుతం ఎంప్లాయీస్​ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్​ (ఈపీఎఫ్​ఓ) చందాదారులు తమ పీఎఫ్ డబ్బును విత్​డ్రా చేసుకోవాలంటే, ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. దీని వల్ల పీఎఫ్​ డబ్బులు పొందడానికి చాలా సమయం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

రూ.1లక్ష నుంచి రూ.5లక్షలకు పెంపు
ఆటో-సెటిల్​మెంట్ మోడ్ కింద, దరఖాస్తు ఫారమ్​ దాఖలు చేసిన 3 రోజుల్లో పీఎఫ్​ విత్​డ్రా క్లెయిమ్​ను ఎలక్ట్రానిక్​గా పరిష్కరిస్తారు. కనుక మాన్యువల్ పనులు చేయాల్సిన పని తప్పుతుంది.​ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ఆటో-సెటిల్​మెంట్ మోడ్​ పరిమితిని మంగళవారం రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచారు. దీని వల్ల ఈపీఎఫ్​ఓ చందదారులకు చాలా ప్రయోజనం చేకూరనుంది. ముఖ్యంగా విద్య, వివాహం, గృహ అవసరాలకు, అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కేవలం 3 రోజుల్లోగా తమ పీఎఫ్​ డబ్బులు పొందగలుగుతారు.